ధృతరాష్ట్ర ఉవాచ:
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః l
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ll 1-1
ధృతరాష్ట్రుడు పలికెను- ఓ సంజయా!యుద్ధ సన్నద్ధులై నా ధర్మక్షేత్రమైన కురుక్షేత్ర మునకు చేరియున్న నా కుమారులును పాండు పుత్రులు ను ఏమి చేసిరి?
సంజయ ఉవాచ:
దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా l
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ll 1-2
సంజయుడు పలికెను – ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించియున్న పాండవ సైన్యమును చూచి, ద్రోణాచార్యుని కడకేగి యిట్లు పలికెను.